సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. సూర్యాపేట జిల్లాలో దాదాపు 25 వేల దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. కొత్త పింఛన్లను ఇప్పటికైనా మంజూరు చేయాలని లబ్దిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.