CTR: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈ నెల 19న ఐరాల మండలం పైపల్లె సబ్-డివిజన్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చిత్తూరు అర్బన్ ఈఎంఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు టౌన్, బంగారుపాళ్యం, రెడ్డిగుంట, పైపల్లె సబ్-డివిజన్లోని సెక్షన్ల పరిధిలోని వినియోగదారులు తమ సమస్యలు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చన్నారు.