NZB: సాలూరకు చెందిన రైతు గంగారాం వ్యవసాయంలో వినూత్న పద్ధతులు, రైతు సమస్యలపై పోరాటం వల్ల పుడమిపుత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 35 ఏళ్లుగా వరి, చెరుకు, కూరగాయలు, మామిడి, జామ పంటలు సాగు చేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుంటారు. ఈనెల 26న హైదరాబాద్లో ఆయనకు అవార్డు ఇవ్వనున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.