SRPT: మోతే మండలం విభళ్లపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలేని నిర్మాణంతో ఇళ్లలో చీలికలు ఏర్పడగా, కరెంట్, త్రాగునీరు వంటి వసతులు లేవని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వర్షాల సమయంలో బురద, దోమలు, పాముల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి వసతులు ఏర్పాటు చేయాలన్నారు.