HNK: హన్మకొండ నగరంలో నేడు కేయూకు ఎమ్మెల్సీ మల్లన్న ఉదయం 11 గంటలకు క్యాంపస్లోని సెనేట్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వర్సిటీ సమస్యలు, విద్యా ప్రమాణాలు, హాస్టల్ సమస్యలు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై విద్యార్థులతో చర్చించనున్నారు. పరిష్కార మార్గాలను అన్వేషించే లక్ష్యంతో నిర్వహించనున్నట్లు బీసీ సెల్ డైరెక్టర్ సతీశ్ తెలిపారు.