NZB: ధర్పల్లి మండలం వాడి, మద్దుల తండా గ్రామాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.