SRPT: కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలని కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్లో కౌన్సిలర్ తుమ్మల నాగేంద్రమ్మతో కలిసి దోమల మందు పిచికారీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంలో కోదాడ పట్టణాన్ని జిల్లాలో అగ్ర స్థానంలో నిలుపుతామన్నారు.