SRPT: జనగణన–2027 దేశాభివృద్ధికి కీలకమని, ప్రజలందరూ సర్వే సిబ్బందికి సరైన వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సేకరించిన గణాంకాలు సంక్షేమ పథకాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అపోహలకు తావివ్వకుండా, ప్రజలందరూ సర్వేలో పాల్గొని ఖచ్చితమైన వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు