SRD: దక్షిణ కాశీగా పేరుగాంచిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ సంగమేశ్వర్ 11 మంది సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారుచేసి ఇవ్వాలని అన్నారు.