ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ. 1,07,953లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ. 38,730లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ. 22,830 ఆదాయం లభించిందన్నారు. అదేవిధంగా అన్నదానానికి విరాళాల ద్వారా రూ. 35,876లు, పంచామృతాభిషేకానికి రూ. 5516లు వచ్చాయన్నారు.