SDPT: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొని మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో 3.వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు.