NZB: ఎడపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మచ్చుకూర్ గంగాధర్ ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని, గ్రామంలోని పలు సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, మస్తాన్, నవీన్ పాల్గొన్నారు.