WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం అనంతరం నేడు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో కొనుగోళ్లు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. మార్కెట్కు పత్తి తరలి రాగా క్వింటా పత్తి రూ.7,350 పలికిందని అధికారులు తెలిపారు. గత వారం రూ.7500 పలికిన పత్తి ధర ఇవాళ తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.