ADB: బోథ్, సొనాల మండలాలలో బుధవారం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సోనాల మండల కేంద్రంతో పాటు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్, దన్నూర్ ( బి ), మర్లపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన జొన్నల కొనుగోలు కేండ్రాలలో రైతులు నిలువ చేసుకున్న ధాన్యపు బస్తాలను వర్షం నుంచి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు.