MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధి సాయిబాబా నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. సోమవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్లును కలిసి తమ కాలని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.