ASF: పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్టు సద్వినియోగం చేసుకుని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని TSUTF ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి శుక్రవారం ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 5, 6 తరగతులు చదివే విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 15న పరీక్ష ఉంటుందని వివరించారు.