PDPL: సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. GDK తిలక్ నగర్ ఆఫీస్లో గురువారం సింగరేణి పరిరక్షణ- కార్మిక హక్కులపై సమావేశం నిర్వహించారు. రియాజ్ అహ్మద్, రాజన్న, విశ్వనాథ్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు.