KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షి దంపతులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.