KMM: గడ్డి మందు తాగి రైల్వే ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రైల్వే ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఓ విషయంలో గడ్డి మందు తాగింది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఎస్సై రాణాప్రతాప్ వేధింపుల కారణంగానే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.