MNCL: తాండూరు మండలంలోని చంద్రపల్లి గ్రామంలో VRA గా విధులు నిర్వహిస్తున్న బురుస శంకర్ (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల తహసీల్దార్ జ్యోష్ణ, డీటీ కల్పన, ఆర్ఐలు పద్మజా, ఎజాజోద్దీన్, సిబ్బంది, తోటి వీఆర్ఏలు సంతాపం తెలిపి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.