MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో విద్యార్థిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ డిమాండ్ చేశారు. శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ… అధికారుల అండదండలతోనే పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని హెచ్చరించారు.