SRCL: వేములవాడలో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అలాగే ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.