PDPL: 2026 ఫిబ్రవరి 28లోపు వ్యవసాయ భూమికి పట్టాదారునిగా నమోదై పట్టా పాసు పుస్తకం కలిగిన వారు రైతు భరోసాకు ఈనెల 20 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. క్లస్టర్ రైతు వేదికల్లో ఏఈవోలకు రైతు భరోసా దరఖాస్తు పత్రం, పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు సమర్పించాలన్నారు.