SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామం వద్ద ఓ కారు అదుపుతప్పి అందులో ఉన్న పురోహితుడికి ప్రాణాపాయం తప్పింది. గొల్లపల్లి గ్రామానికి చెందిన పురోహితుడు రఘురామ శర్మ తన కారులో రాజన్నపేట గ్రామానికి వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో పక్కనున్న చెట్టును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో రఘురామ శర్మ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు.