VKB: బొమ్మరాస్పేట మండలం మదన్పల్లిలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. రహదారులన్నీ మంచు కురిసినట్లుగా తెల్లగా మారిపోయాయి. ఈ అకాల వర్షం వల్ల కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడినప్పటికీ, పంట నష్టం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది.