JN: గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (GMPS) 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్, జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. జనగామ బీరప్ప గుడి ఆవరణలో GMPS ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించి మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.