VKB: మర్పల్లిలోని రైల్వే గేటు వద్ద వాహనదారులు భారీ ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలో గేటు పడడంతో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. నిత్యం ఈ సమస్యతో బాధపడే ప్రజలు బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.