NZB: సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. చంద్రయాన్ పల్లికి చెందిన ముత్తవ్వ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శస్త్రచికిత్సకు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఆదివారం ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.