MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాలానగర్ ఎస్సై లెనిన్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూడళ్ల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకూడదని, రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లకూడదన్నారు. ఎన్నికల నియమాలు పాటించి శాంతిని కాపాడాలన్నారు. ఏమైనా జరిగితే 100కు ఫోన్ చేయాలన్నారు.