MNCL: నీటిని పొదుపుగా వాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. ఆదివారం దండేపల్లి మండలంలోని చెల్కగూడా గ్రామంలో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత గురించి అధికారులు వివరించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందని తెలిపారు.