NLG: వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5:50 గంటలకు నందీశ్వరుని అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ‘ఓం నమశ్శివాయ’ స్మరణతో అగ్నిగుండం దాటి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.