ADB: ఉట్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పంచాయతీలోని పలు వార్డుల్లో ఉదయం నుంచే కార్మికులు చెత్తను తొలగించారు. కాగా పారిశుద్ధ్య పనులను సర్పంచ్ అనిత శ్రీనివాస్ పరిశీలించి కార్మికులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రజలు రోడ్లపై, నాలాల్లో చెత్తను వేయకుండా సూచించిన స్థలాల్లోనే వేయాలన్నారు.