SRPT: నాగారం మండలం పస్తాల, పసునూరు స్టేజి మరియు రావులపల్లి ఎక్స్ రోడ్ రహదారులు గుంతలమయమై వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా, గతంలో నిధులు మంజూరయ్యాయని చెబుతున్నా.. నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.