NLG: వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వెనుక ఉన్న నర్సరీలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 800 నుంచి 900 మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.