ADB: గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేరడీగొండ మండల కేంద్రంలోని ప్రత్యేక మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొని సమావేశంలో మాట్లాడారు. మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.