SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి సోమవారం వేములవాడ ఏఎస్పీ కుమారి శేషాద్రిని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏఎస్పీకి స్వామివారి శేష వస్త్రం లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులపై చర్చించి, ఇరు విభాగాల సమన్వయంతో దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విషయంలో సంప్రదింపులు జరిపారు.