MNCL: మంచిర్యాల స్థానిక ప్రభుత్వ ITIలో PMKVY 4.0 కింద పలు కోర్సుల్లో నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. CNC ఆపరేటర్ (టర్నింగ్), ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో 3నెలలు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు అన్నారు. మార్చ్ 3లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.