NZB: రాష్ట్రంలో రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దుర్మార్గంంగా సాగుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన రెండేళ్ల పాలనలో అవినీతి అక్రమాలే ఉన్నాయని దుయ్యబట్టారు.