MDK: తూప్రాన్ పశు వైద్యశాలలో చికిత్స పొందుతూ జింక మృతి చెందినట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద అటవీ నుంచి బయటకు వచ్చిన జింకపై ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, తూప్రాన్ ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.