KNR: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు రజిత, రాధతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.