ADB: ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తాంసి ఎంపీడీవో మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని పొన్నారి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ తలారి భూమన్న, సెక్రటరీ గంగన్న, మాజీ ఎంపీటీసీ రఘు, విలాస్, రామన్న, తదితరులున్నారు.