ములుగు ఎమ్మెల్యే సీతక్క అర్ధరాత్రి ధర్నాకు దిగారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. బ్యాలెట్ పత్రంపై తన ఫోటో చిన్నగా ఉందని ఆమె తెలుపుతూ దానిని మార్చాలని కోరారు.
హైదరాబాద్లో(Hyderabad) హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటలకే ఓపెన్ చేయనున్నారు. అంతేకాదు రాత్రి కూడా 12 గంటల వరకు తెరిచే ఉంచనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
తాము ఎందుకు పార్టీ మారామో వివరించారు రాములమ్మ విజయశాంతి. ఆ నాడు బీఆర్ఎస్ పార్టీపై చర్యలు ఉంటాయని చెబితేనే పార్టీలో చేరామని.. ఎలాంటి యాక్షన్ తీసుకోక పోవడంతో తిరిగి సొంతగూటికి చేరామని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్ ఉంటుంది. అదే అంశంపై నేతలు ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు. ఇదే అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ అమ్మమ్మ ఊరు ఉందట.. మరి ఇన్నాళ్లు నియోజకవర్గం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి తీసుకోని వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలపై విచారణకు కమిటీ వేస్తామని పేర్కొన్నారు.
గద్వాలలో సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి చిట్టా చాలా ఉందన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వేల కోట్లను మింగేసిండని అమిత్ షా పేర్కొన్నారు.