బర్రెలక్క శిరీష తరఫున మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్లో ప్రచారం నిర్వహించారు. శిరీష ఎన్నికల్లో పోటీచేయడాన్ని అభినందించారు. రాజకీయాల్లోకి బర్రెలక్కలాంటి యువత రావాలని కోరారు. ఈల గుర్తుకు ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం, మధిర, పాలేరు సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఖమ్మంలో జరిగిన రోడ్ షోలో డ్యాన్స్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కేసీఆర్ వేల కోట్లు దాచాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి వందసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ పార్టీ కేసీఆర్ కనుసైగలతో నడుస్తుందన్నారు.
కామారెడ్డి నుంచి బరిలోకి దిగిన సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించాలని ప్రజలను ప్రధాని మోడీ కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా పెట్రేగిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత పదేళ్లలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి ఇంట్లో.. పాతబస్తీలో ఏకకాలంలో రైడ్స్ జరిగాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నేడు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే శుభవార్తలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలం చెల్లిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన జరగలేదని విమర్శించారు.
బర్రెలక్క శిరీషకు భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
సచివాలయం ముందు ఓ యువకుడు స్కూటీతో ఫీట్ చేశాడు. బైక్తో 16 సెకన్ల పాటు విన్యాసాలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కేసీఆర్కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడని మంత్రి హరీశ్ రావు అన్నారు. కానీ తాను సీఎం అవుతానని కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. అతనే కాదు ఓ 10 మంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని వివరించారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి బరిలో ఉన్న బర్రెలక్క తాను గెలిస్తే ఏం చేస్తాననే అంశానికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.