గత పదేళ్లుగా తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయోద్దని ప్రజలకు సూచించారు.
కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు దక్కాయని.. అతని కుటుంబం కోసం భవనాలు నిర్మించారని.. కొత్త కొత్త కార్లు కొనుగోలు చేశారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. జహీరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక పాల్గొన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ(telangana assembly elections 2023) ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థులకు మద్దతు కోరుతూ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాండ్ పేపర్లపై సంతకాలు చేశారు. అయితే కొందరు అభ్యర్థులు దేవాలయాలకు వెళ్లి పూర్తి చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయడం ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఓ హోటల్లో ఉంటే..తన వద్దకు వెళ్లి పలువురు కాంగ్రెస్ నేతలు బెదిరించారమని అంటున్నారు.
తెలంగాణలో ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రముఖ బైక్ రైడింగ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30న హైదరాబాద్లో ఓటర్లకు ఫ్రీ రైడ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉండి ధనవంతులు కావడమే వారి లక్ష్యమని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(priyanka gandhi) అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆమె బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్లో ప్రధాని మోడీ ప్రర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని వెల్లడించారు. దీంతోపాటు మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత సంపత్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి, సంపత్ లేని సమయంలో ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న సంపత్ భార్య మహాలక్ష్మీకి బీపీ పెరిగిపోయింది. సృహ తప్పి పడిపోయింది.
అందరూ కలిసి ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని సీపీఐ అగ్రనేత నారాయణ అన్నారు. కానీ తన ఒక్కడి వల్లే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు.
రైతుబంధుకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ఉన్న దృష్ట్యా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని స్పష్టంచేసింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తోందని తెలిపింది.
తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ అభ్మర్థిని సీఎంగా ప్రకటించినందుకే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చానన్నారు. ఏపీ తనకు జన్మనిస్తే తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడతానని తెలిపారు.