సచిన్ పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ గురించి ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ పేరుతో రైల్వే స్టేషన్ ఉండటం ఆనందంగా ఉందన్నారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టీ20 ఈరోజు(నవంబర్ 28న) గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టీమిండియా గెలవాలని చూస్తుండగా..మరోవైపు ఆసీస్ జట్టు ఈ మ్యాచులో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది.
రెండో టీ 20లోనూ భారత్ బంపర్ విక్టరీ కొట్టింది. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు.
భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలి టీ20లో భారత్ విజయం సాధించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తిరువనంతపురం వేదికగా రెండో టీ20 జరుగుతోంది.
ఐపీఎల్ 2024 లీగ్ కోసం జట్లు తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, వేలంలోకి వదిలేసే ప్రక్రియ ఈ సాయంత్రంతో ముగిసింది. దీంతో ఏ జట్లో ఎవరు ఉన్నారో క్లారిటీ వచ్చింది. సన్ రైజర్స్ భారీగా ఆటగాళ్లను విడుదల చేసింది. అందులో ఖరీదైన ఆటగాడు కూడా ఉండడం విశేషం.
నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టీ20 మ్యాచ్ సాగనుంది.
రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్లో ఆడాలంటే కోహ్లీలా ఫిట్నెస్ కాపాడుకోవాలని శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నారు. ఆయనకు నెక్ట్స్ వరల్డ్ కప్ కూడా ఆడే సత్తా ఉందన్నారు.
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీరు తాగడం కలకలం రేపుతోంది.
విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి 20 మ్యాచ్లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బాల్ను రింకూ సింగ్ సిక్సర్గా మలచడంతో విక్టరీ కొట్టింది. ఆ సిక్సర్ను అంపైర్లు పరిగణలోకి తీసుకోలేదు.
భారత క్రికెట్ హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. తననే కొనసాగించడానికి బీసీసీఐ సుముఖత చూపినా, ద్రావిడ్ ఆసక్తి కనబరుస్తలేడు. ఆయన ప్లేస్లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టనున్నారు.
విశాఖపట్నం వేదికగా ఈరోజు ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20 ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందనే గెలుపు అంచనాలను ఇప్పుడు చుద్దాం.