ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది. ప్రపంచ క్రికెట్ కప్ గెలుపొందిన జట్టుకు రూ.33 కోట్లు, రన్నరప్గా నిలిచిన జట్టుకు 16.64 కోట్ల రూపాయల బహుమతిని అందజేయనున్నారు.
2023 ప్రపంచకప్ (World Cup 2023 Final) అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. ఒక్క మ్యాచ్ ఓడకుండా, ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ ఓడిస్తూ ఫైనల్ చేరిన భారత్ (Team India) ఓవైపు.. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించినా, తర్వాత బలంగా పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చిన ఆస్ట్రేలియా (Australia) ఇంకోవైపు. మూడోసారి ప్రపంచకప్ గెలవడానికి వచ్చిన సువర్ణావకాశాన్ని వదులకోకూడదని టిమిండియా పట్టుదలతో ఉంది.
వరల్డ్ కప్ కోసం రెండేళ్ల కింద నుంచి సన్నాహాలు చేస్తున్నానని రోహిత్ శర్మ మీడియాతో చెప్పారు. జట్టు విజయానికి కారణం కోచ్ ద్రావిడ్ అని.. అతను ఆటగాళ్లకు స్వేచ్చను ఇచ్చి.. ప్రోత్సహిస్తాడని తెలిపారు.
ప్రపంచ కప్లో రోహిత్ శర్మ ధాటిగా ఆడటానికి కారణం విరాట్ కోహ్లీ అని సీనియర్ పేసర్ ఆశిష్ నేహ్రా తెలిపారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ నాణేనికి రెండు వైపుల వంటివారని వివరించారు.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కోసం అంత సిద్ధం అయింది. ఈ ఉత్కంఠ పోరులో భారత్ గెలవాలని ఎంతో పట్టుదలతో ఉంది. ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్లో ఈ మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకం కానున్నాడని గౌతమ్ గంభీర్ జోస్యం చెప్పారు.
అమితాబ్ బచ్చన్ ఫైనల్ మ్యాచ్ చూడొద్దు అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ఆయన చూడపోతేనే కివీస్ భారత్ ఘన విజయం సాధించిందని, అందుకే ఈ ఒక్క మ్యాచ్కు దూరంగా ఉండండి అని అభ్యర్ధిస్తున్నారు. దీనిపై బిగ్ బీ సైతం స్పందించడం విశేషం.
ఎస్ఎల్సీని బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని మాజీ క్రికెటర్ అర్జున రణతుంగా చేసిన ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. జై షాపై రణతుంగ వ్యాఖ్యలు పై శ్రీలంక ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.10 జట్లు పాల్గొన్న వరల్డ్ కప్ లో లంక జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 7 ఓటములు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును క్రీడల మంత్రి రద్దు చేశారు.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ 2023 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో నవంబర్ 19న లైవ్ కార్యక్రమాలు ఉదయం నుంచే ప్రారంభమవుతాయని స్టార్ స్పోర్ట్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అహ్మదాబాద్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన ప్రేక్షకులను అచ్చెరవొందేలా ఓ ఎయిర్ షో సిద్దం చేసింది. ఎయిర్ ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం యుద్ధవిమానలతో స్టేడియం గగనతలంపై విన్యాసాలు చేయనున్నారు.
ప్రపంచ కప్ 2023లో లీగ్ దశలో అద్భుతంగా ఆడిన దక్షిణాఫ్రికా జట్టు రెండో సెమీస్లో మాత్రం ఆస్ట్రేలియా జట్టుపై తడబడింది. దీంతో కంగారూల చేతిలో కేవలం మూడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇక ఫైనల్ పోరులో నవంబర్ 19న భారత జట్టుతో ఆసీస్ తలపడనుంది.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్లో విమాన టిక్కెట్ల రేట్లతోపాటు హోటళ్లలో రూముల ధరలు(hotel rates) కూడా అమాంతం 100 నుంచి 200 రెట్లు పెరిగిపోయాయని అక్కడి జనం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరాత్రికి స్టార్ హోటళ్లలో ఎంత ధరలు పెరిగాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ముంబాయి వాంఖడే వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం భారతీయులు ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు. అందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారట. ఆట కోసం రాత్రంతా మేల్కొనే ఉన్నారని తెలిపారు.
నిన్న జరిగిన మ్యాచ్లో షమీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే షమీ 7 వికెట్లు తీస్తాడని ముందు రోజే ఓ నెటిజన్ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టుకు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.