టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరూ నిసర్గ పేరుతో కొత్త వెంచర్ను కూడా ప్రారంభించారు. విజయదశమి రోజు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు కోహ్లీ, అనుష్క శర్మ ప్రకటించారు.
ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. కోహ్లీ 95 పరుగులతో సెంచరీ మిస్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ జట్టు టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్ను ఉంచింది.
వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ రికార్డును బ్రేక్ చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మూడో స్థానానికి చేరాడు. వరల్డ్ కప్లల్లో ఇప్పటి వరకూ షమీ 32 వికెట్లు పడగొట్టి కుంబ్లే రికార్డును తిరగరాశాడు.
ప్రపంచకప్లో భారత్, బంగ్లాదేశ్తో ఆడిన నాలుగవ మ్యాచ్లో కోహ్లీ ఆటకు అందరు ఎంతో ఫిదా అయ్యారు. ప్రతి ఒక్కరు కోహ్లీ చేసిన సెంచరీ గురించే మాట్లాడారు. తాజాగా ఆయన సెంచరీపై పుజారా అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంచరీ కాదు..టీమ్ విజయం ముఖ్యం అంటున్నారు.
హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. తాజాగా రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. అదెంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో భాగంగా రెండు మ్యాచులు ఉన్నాయి. ఉదయం పదిన్నరకు ఒకటి మొదలు కాగా..మధ్యాహ్నం రెండు గంటలకు మరొకటి ప్రారంభం కానుంది. ఉదయం మ్యాచ్ ఇప్పటికే మొదలు కాగా..మొదట టాస్ గెల్చిన నెదర్లాండ్స్ జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. అయితే ఈ గేమ్లో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
నేడు జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. పాక్ జట్టు విఫలం అయ్యింది. ఈ టోర్నీలో పాక్ జట్టుకు ఇది రెండో ఓటమి. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ సూపర్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డు అందుకున్నాడు.