తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో హైదరాబాద్లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దయ్యింది. ఈ రేస్ను చెన్నైకి మారుస్తున్నట్లుగా రేసింగ్ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు.
వన్డే వరల్డ్ కప్లో నేడు బంగ్లాదేశ్పై పాక్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో పాక్ విజయాన్ని పొందింది. మూడు వికెట్లకు లక్ష్యాన్ని ఛేదించడంతో నెట్ రన్ రేట్ను పాక్ జట్టు పెంచుకుంది. బాబర్ సేనకు విజయం దక్కడంతో పాక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ రోజు పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా మొదట్లో మూడు కీలక వికెట్లు పడడంతో నెమ్మదించింది. ఇక మొత్తానికి 204 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.
కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరగబోయే భారత్-దక్షిణ ఆఫ్రికా మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని పాక్ క్రికెటర్ మహ్మాద్ రిజ్వాన్ అన్నాడు. నవంబర్ 5 విరాట్ బర్త్డే మరింత ప్రత్యేకం కావాలని కోరుకున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం 70 వేల కోహ్లీ ఫేస్ మాస్క్లను రెడీ చేస్తోంది.
నేటి వరల్డ్ కప్ మ్యాచ్లో శ్రీలంకను ఆఫ్ఘన్ జట్టు ఓడించింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఆఫ్ఘన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
2023 వన్డే ప్రపంచకప్ భారత్లో జరుగుతుండగా పాకిస్థాన్ క్రికెట్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
అఫ్ఘనిస్థాన్ టాప్ క్రికెటర్ రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారని నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. పాక్పై అఫ్ఘన్ విజయం సాధించిన సందర్భంగా రషిద్ గురించి ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
వన్డే ప్రపంచకప్లో టీమిండియా తన విజయ యాత్రను కొనసాగిస్తోంది. ఈ జైత్రయాత్రలో నేడు మరో విజయాన్ని పొందింది. లక్నో వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
వన్డే వరల్డ్కప్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ రోజు లక్నో వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఇరు జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇండియా ప్లేయర్స్ను కట్టడి చేసింది. వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా ఆడినా భారత్ నిర్ణీత ఓవర్లలో 229 పరుగులు చేసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్ చేస్తోండగా గాయపడ్డారు. ఇంగ్లాండ్తో కీలకమైన లీగ్ మ్యాచ్ ముందు రోహిత్కు గాయమైంది. దీంతో అతను ఆడతాడా లేదా అనే సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది.
నేటి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్పై నెదర్లాండ్స్ జట్టు ఘన విజయం సాధించింది. బంగ్లా జట్టు 142 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో నెదర్లాండ్స్ టీమ్ 87 పరుగుల తేడాతో ఘన విజయాన్ని పొందింది.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఆసిస్ కేవలం 2 లీగల్ బంతుల్లోనే 21 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
హిమాచల్ప్రదేశ్లోని ధర్శశాలలో జరుగుతున్న ప్రపంచ వన్డే వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు పోరాడినా ఓటిమిపాలు అయింది.