వన్డే ప్రపంచకప్లో భాగంగా నేడు పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. కీలక మ్యాచ్లో పాకిస్థాన్ ఎలా ఆడుతుందోననే ఆసక్తి నెలకొంది.
ఆసీస్, కివీస్ మ్యాచ్లు గెలిస్తే.. ఆ రెండు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటాయి. టోర్నీ నుంచి పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఇంటికి వెళ్లిపోతాయి.
వన్డే ప్రపంచ కప్ 2023లో సెమీ ఫైనల్ అర్హత కోసం జరిగిన పోటీలో ఆప్గానిస్తాన్ జట్టు నెదర్లాండ్స్పై ఘన విజయం సాధించింది. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు సెమీస్ ఆశలను మరింత కఠినం చేసింది. ఈ గెలుపుతో ప్రస్తుతం ఆప్గాన్ జట్టు న్యూజిలాండ్ తో సమానంగా పాయింట్ల పట్టికలో ఉండటం విశేషం.
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
2023 ప్రపంచ కప్ సెమీఫైనల్కు వెళ్లే క్రమంలో భారత జట్టు కీలకమైన జైత్ర యాత్రను కొనసాగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 మ్యాచులు వరుసగా గెల్చి అద్భుతమైన రికార్డు సాధించింది. తాజాగా శ్రీలంక జట్టుపై 302 పరుగుల తేడాతో గెలుపొందింది.
నేడు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 33వ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు మిస్సయ్యాయి. అయితే ముందుగా శుభ్మాన్ గిల్ తన ఏడో వన్డే సెంచరీ చేసేందుకు ముందు 92 రన్స్ వద్ద ఔట్ కాగా..సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
ఈరోజు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ ఛేజ్ చేస్తాడని అనుకుంటే..అది పూర్తి కాకుండానే ఔట్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన ఇన్నింగ్స్లో టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును విరాట్ సమం చేయాలని అభిమానులు ఆత్రుతగా చూడగా అది ఈరోజు సఫలం కాలేదు.
వరల్డ్ కప్లో మాంచి ఊపు మీదుంది టీమ్ ఇండియా. జట్టు విజయాల గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. నాయకుడిగా ఏ నిర్ణయం తీసుకున్న.. ఆ క్రెడిట్ సభ్యులకు కూడా దక్కుతుందని చెబుతున్నారు.
వన్డే ప్రపంచ కప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగగా..సౌతాఫ్రికా జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాంటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 357 రన్స్ చేయగా..ఇక తర్వాత చేధనకు దిగిన న్యూజిలాండ్ పూర్తి చేయకుండానే 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
వాంఖడే స్టేడియంలో నేడు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం భారత్, శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ఒక రోజు ముందుగానే సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి బీసీసీఐ సభ్యులతో పాటుగా సచిన్ కూడా హాజరుకానున్నారు.
పాకిస్థాన్ కిక్రెటర్ షోయబ్ మాలిక్ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. ఇండియన్ టీమ్ గెలవాలంటే అతని సూచనలు తప్పనిసరిగా ఉండాలని ఓ ఇంటర్వూలో తెలిపాడు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి పీవీ సింధు మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఆమె కొన్ని వారాల పాటు ఆటకు దూరం కానుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననుంది.