»Ipl 2024 Shock For Rohit Sharma Fans Pandya As The New Captain Of Mumbai Indians
IPL 2024: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు షాక్..ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా పాండ్యా
ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను పక్కకు పెట్టడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
రోహిత్ శర్మ ఫ్యాన్స్కు ముంబై ఇండియన్స్ టీమ్ యాజమాన్యం షాకిచ్చింది. ఐపీఎల్2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్గా ప్రకటించింది. రోహిత్ శర్మను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తూ నేడు కీలక ప్రకటన చేసింది. ఈ మధ్యనే ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Ro, In 2013 you took over as captain of MI. You asked us to ???????. In victories & defeats, you asked us to ?????. 10 years & 6 trophies later, here we are. Our ??????? ???????, your legacy will be etched in Blue & Gold. Thank you, ??????? ??? pic.twitter.com/KDIPCkIVop
హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడంతో రోహిత్ శర్మ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు గతంలో రోహిత్ శర్మ ఐదుసార్లు ట్రోఫీని అందించాడు. దీంతో రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇటీవలె వన్డే ప్రపంచ కప్లో కూడా టీమిండియాను రోహిత్ శర్మ ఫైనల్కు చేర్చాడు. అలాంటి వ్యక్తికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తప్పించడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ గ్లోబల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హెడ్ మహేల జయవర్దనే కెప్టెన్సీ మార్పుపై స్పందించాడు. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ సేవలు మరువలేనివని అన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ అత్యుత్తమ కెప్టెన్గా పేరొందాడని తెలిపారు. అయితే ముంబై ఇండియన్స్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా కెప్టెన్ను మార్చినట్లు వెల్లడించారు. ఇది జట్టుకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు.